తెలంగాణ తిరుపతిగా వెంకటేశ్వర ఆలయం : మంత్రి పోచారం శ్రీనవాస్ రెడ్డి
నిజామాబాద్ : జిల్లాలోని బీర్కూర్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో నిర్మించిన ఆలయం తెలంగాణ తిరుపతిగా అభివృద్ది చెందాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వెంకటేశ్వర విగ్రహా ప్రతిష్టాపన మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం మంత్రి ఏర్పాట్లను పరిశీలించారు. మార్చి 1 విగ్రహా ప్రతిస్టాపన కార్యక్రమం ఉన్నందున ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఆలయం తెలంగాణ తిరుపతిగా పెరోందాలని ఆశించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు విగ్రహా ప్రతిష్టాపనకు విచ్చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ నెల 28న త్రిదండి చిన్నాజీయర్ స్వామి పర్యవేక్షణలో నిత్యహోమాలు, సామూహిక విష్ణు సహాస్ర పారాయణం, హోమమం, శయ్యాదివాసము, అధివాస హోమము, పుష్పది వాసము, బలిహరోము జరుగుతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్కర్తలు, శంభురెడ్డి, ఆలయ కమిటి సభ్యులు పాల్గొన్నారు.
గట్టి బందోబస్తు : తెలంగాణ సియం ఆలయ ప్రారంబోత్సవానికి విచ్చేస్తున్న సందర్బంగా గట్టి బందో బస్తు ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం తెలంగాణ స్పెషల్ టీం కుంబింగ్ నిర్వహించారు.


No comments:
Post a Comment