రెండు రాష్ట్రాల మధ్య మరో వివాదం.
నాగార్జునసాగర్ డ్యాం విషయంలో రెండు రాష్ట్రాల మధ్య మరో వివాదం మొదలైంది. డ్యాం లోని సగం గేట్ల నిర్వహణ తమకు అప్పగించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేఖ రాయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో నాగార్జునసాగర్ డ్యాం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ డ్యాం ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య హాట్ టాపిక్ గా మారింది. ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల పై వివాదం కొనసాగుతున్న నేపద్యంలో మరో వివాదం తెరపైకి వచ్చింది. నాగార్జున సాగర్ డ్యాం లోని సగ భాగం తమకు అప్పగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఖ రాసింది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు సరిగ్గా నల్గొండ,గుంటూరు జిల్లాల సరిహద్దుల్లో నిర్మించారు. డ్యాం లోని సగభాగం నల్గొండ జిల్లాకు భూభాగంలో, సగభాగం గుంటూరు జిల్లా భూభాగంలో ఉంది. అంటే ప్రాజెక్టు గేట్లు మొత్తం 26 ఉంటే...అందులో 13గేట్లు నల్గొండ జిల్లాలో మరో 13 గేట్లు గుంటూరు జిల్లా పరిధిలో ఉన్నాయి. ఈ నేపధ్యంలో తమ భూభాగంలో ఉన్న 13 గేట్ల నిర్వహణ తమకే అప్పగించాలని మాచర్ల తాసిల్దార్,ఎస్ఐ తో పాటు నీరుపారుదల శాఖ అధికారులు నాగార్జునసాగర్ డ్యాం ఎస్ఈ విజయభాస్కర్ కు లేఖ రాశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసే అవకాశాలుండడం వల్ల మిర్యాలగూడ డిఎస్పీ ఆధ్వర్యంలో నాగార్జున సాగర్ డ్యాం వద్ద బారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.
అయితే ఈ విషయాన్ని తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ అంశంపై హైదరాబాద్ లో ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ అధికారులు లేవనెత్తిన ఈ వివాదం పూర్తిగా విభజన చట్టానికి వ్యతిరేకమని తెలంగాణా నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు.
నాగార్జునసాగర్ డ్యాం విషయంలో రెండు రాష్ట్రాల మధ్య మరో వివాదం మొదలైంది. డ్యాం లోని సగం గేట్ల నిర్వహణ తమకు అప్పగించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేఖ రాయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో నాగార్జునసాగర్ డ్యాం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ డ్యాం ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య హాట్ టాపిక్ గా మారింది. ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల పై వివాదం కొనసాగుతున్న నేపద్యంలో మరో వివాదం తెరపైకి వచ్చింది. నాగార్జున సాగర్ డ్యాం లోని సగ భాగం తమకు అప్పగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఖ రాసింది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు సరిగ్గా నల్గొండ,గుంటూరు జిల్లాల సరిహద్దుల్లో నిర్మించారు. డ్యాం లోని సగభాగం నల్గొండ జిల్లాకు భూభాగంలో, సగభాగం గుంటూరు జిల్లా భూభాగంలో ఉంది. అంటే ప్రాజెక్టు గేట్లు మొత్తం 26 ఉంటే...అందులో 13గేట్లు నల్గొండ జిల్లాలో మరో 13 గేట్లు గుంటూరు జిల్లా పరిధిలో ఉన్నాయి. ఈ నేపధ్యంలో తమ భూభాగంలో ఉన్న 13 గేట్ల నిర్వహణ తమకే అప్పగించాలని మాచర్ల తాసిల్దార్,ఎస్ఐ తో పాటు నీరుపారుదల శాఖ అధికారులు నాగార్జునసాగర్ డ్యాం ఎస్ఈ విజయభాస్కర్ కు లేఖ రాశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసే అవకాశాలుండడం వల్ల మిర్యాలగూడ డిఎస్పీ ఆధ్వర్యంలో నాగార్జున సాగర్ డ్యాం వద్ద బారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.
అయితే ఈ విషయాన్ని తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ అంశంపై హైదరాబాద్ లో ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ అధికారులు లేవనెత్తిన ఈ వివాదం పూర్తిగా విభజన చట్టానికి వ్యతిరేకమని తెలంగాణా నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు.


No comments:
Post a Comment