Follow Us:

RSS

Wellcome to Our Website

We are working on our website design. We are sure this new website will completely blow your mind! Subscribe by entering your e-mail below to stay updated on our progress.

Launching
comeback
launchpad

Saturday, 2 January 2016

ఎమ్మెల్సీ అభ్యర్థి బీ- ఫారాన్నిరూ. 2 కోట్లకు అమ్ముకున్నారు : జడ్పీ మాజీ చైర్మన్ వెంకటరమణారెడ్డి

నిజామాబాద్: షబ్బీర్ అలీ నన్ను అణచివేసేందుకు కుట్ర చేస్తున్నడు. కామారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్‌గా పోటీ చేసినప్పుడు ఓడించారు. తాడ్వాయి జడ్పీటీసీ గా పోటీ చేసినప్పుడూ నా ఓటమికి కుట్రలు పన్నాడు. జిల్లా పరిషత్తు చైర్మన్ అవు తున్న సందర్భంలోనూ అడ్డుకునే ప్రయత్నం చేసిండు.. తాజాగా ఎమ్మెల్సీ టికెట్టు కేటాయించి రూ. 2 కోట్లు డిపాజిట్ చేయించుకున్నడు. మరో మారు రూ. 3.18 కోట్లు ఇవ్వాలని వేధించాడు. ఆయన వేధింపులు తాళలేకే పోటీ నుంచి వైదొలిగాను. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న నేతలను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని పునరుద్ఘాటించారు జడ్పీ మాజీ చైర్మన్, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోటీ నుంచి తప్పుకొన్న కె. వెంకటరమణారెడ్డి. 

నిజామాబాద్ - నమస్తే తెలంగాణ ప్రతినిధి : శాసన మండలిలో మాజీమంత్రి షబ్బీర్‌అలీ తనను కొంతకాలంగా అణచివేసేందుకు కుట్రలు పన్నుతున్నారని.. గతంలో కామారెడ్డి ము న్సిపాలిటీలో కౌన్సిలర్‌గా పోటీచేస్తే ఓడించారని, తాడ్వాయి జడ్పీటీసీ సభ్యుడిగా పోటీచేస్తే ఓడించేందుకు ప్రయత్నించార ని, జడ్పీ చైర్మన్‌గా ఎన్నికవుతున్న సందర్భంలో కూడా అడ్డుతగిలారని, అప్పటి సీఎం వైఎస్‌ఆర్ సహకారంతో చైర్మన్‌గా ఎన్నికయ్యానని కాంగ్రెస్ పార్టీకి చెందిన నిజామాబాద్ జడ్పీ మాజీ చైర్మన్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆరోపించా రు. తా జాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కూడా తనతో రూ. 2 కోట్లు డిపాజిట్ చేయించుకున్నారని, మరో రూ. 3.18 కోట్లు తెచ్చివ్వాలని వేధించింనందుకు తాను పోటీనుంచి వైదొలిగానన్నారు.

ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేసేలా రాజకీయాలు చేస్తున్న మాజీ మంత్రులు షబ్బీర్‌అలీ, సుదర్శన్‌రెడ్డి, మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి, మాజీ ఎంపీ మధుగౌడ్, మాజీ ప్ర భుత్వ విప్ ఈరవత్రి అనిల్, టీపీసీసీ అధికార ప్రతినిధి మహేష్‌కుమార్‌గౌడ్, డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్ సహా కాంగ్రెస్ నేతలను వదిలిపెట్టే ప్రసక్తేలేదని హెచ్చరించారు. ని జామాబాద్ కాంగ్రెస్ నాయకులపై సోమవారం రాష్ట్ర ఎన్నిక ల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు స్పష్టం చేశారు. నిజామాబాద్‌లోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

మూడు దశాబ్ధాలుగా రాజకీయాలు చేస్తున్న ముఖ్యనాయకులు ఇంకా ఎన్నేండ్లుంటారని, ఎన్నేళ్లు బతుకుతారని, రాజకీయాలపై ఆసక్తితోఉన్న కొత్త తరానికి ఎ లాంటి సంకేతాలు ఇస్తారని ప్రశ్నించారు. సర్పంచులు గా, ఎంపీటీసీ- జడ్పీటీసీ సభ్యులుగా, ఎమ్మెల్యేలుగా పోటీచేయదలిస్తే ముందస్తుగా డ బ్బులు డిపాజిట్లు చేసే దుస్థితికి రాజకీయాలను తీసుకొచ్చారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాసుల రాజకీయాలు చేసినట్లు త నవద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, డీసీసీ భవన్‌లోనైనా, ఏఐసీసీ వద్దనైనా సాక్ష్యాలతోసహా నిరూపించేందుకు సిద్ధంగా ఉ న్నానన్నారు. ఓటుకు నోటు రాజకీయాలు చేస్తున్న జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలపై ఇప్పటికే పార్టీ అధ్యక్షురాలు సో నియాగాంధీ కి ఫిర్యాదు చేశానని, రాష్ట్ర ఎన్నికల అధికారి భ న్వర్‌లాల్‌కు కూడా ఫిర్యాదు చేస్తానని తెలిపారు.

కాంగ్రెస్ పా ర్టీకి అభ్యర్థి గతిలేని పరిస్థితుల్లో మాజీ మంత్రులు, మాజీ స్పీ కర్, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులం తా మాట్లాడుకొని తనను ఆశ్రయించారని స్పష్టం చేశారు. 134 మంది ఓటర్ల బలమున్న పార్టీ అభ్యర్థిగా 500 పైచిలుకు ఓటర్ల మద్దతున్న టీఆర్‌ఎస్‌పై పోటీచేసేందుకు తాను రం గం లో దిగినట్లు తెలిపారు. తన అభ్యర్థిత్వం ఖరారయ్యా క పాజిటివ్ టాక్ వచ్చిందని, పొరపాటున గెలిస్తే ఆరేం డ్లు కొరకరాని కొయ్యగా మారుతాడేమోనని కాంగ్రెస్ నాయకులు కుట్రపన్నారన్నారు. ముందస్తుగా డిపాజిట్ చేసిన రూ. 2 కోట్లు పోగా... మరో రూ. 3.80 కోట్లు తెచ్చివ్వాలని వేధించడంతోనే తాను విత్‌డ్రా చేసుకొని, టీఆర్‌ఎస్ విజయానికి బాటలు వేసినట్లు తెలిపారు.

అప్పటికే బంధుమిత్రుల ద్వారా అప్పులు చేశానని, త లకు మించిన భారం మోయలేనని, తన కుటుంబం రో డ్డు న పడుతుందన్న ఉద్దేశంతోనే పోటీ నుంచి వైదొలిగానే తప్ప.. ప్రభుత్వం నుంచిగానీ, టీఆర్‌ఎస్ నుంచి గానీ ఎలాంటి ఒత్తిళ్లు రాలేదని, డబ్బుల కోసమో, పదవుల కోసమో విత్‌డ్రా కాలేదని స్పష్టం చేశారు. జడ్పీ చైర్మన్‌గా పనిచేసిన సమయంలో ఇ సుక ద్వారా రూ. 12 కోట్ల సీనరేజి ఆదాయాన్ని స్థానిక సంస్థలకు సముపార్జించి పెట్టానని, మద్యం సిండికేట్, కల్లు మాఫి యా ఆగడాలకు అడ్డుకట్ట వేశానని, ఉపాధ్యాయ బదిలీలను పారదర్శకంగా నిర్వహించానని అన్నారు. కాంగ్రెస్‌లో పదవు లు అనుభవించిన బడా నేతలు ప్రజలకు, కార్యకర్తలకు లా భం చేయలేదన్నారు. షబ్బీర్‌అలీ ఏడు సార్లు ఎ మ్మెల్యేగా పో టీ చేస్తే ఐదు సార్లు ఓడిపోయారని తెలిపా రు.

బాల్కొండలో భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆర్మూర్‌కు వలసపోయి నా సురేశ్‌రెడ్డిని రెండుసార్లు ప్రజలు ఓడించడమే వారి రాజకీ య జీవితానికి అద్దం పడుతుందని అన్నారు. రెండు సార్లు పో టీ చేసినా ఎమ్మెల్యేగా గెలవలేని మహేష్‌కుమార్‌గౌడ్, తాహెర్‌బిన్‌హందాన్, పార్లమెంటు సభ్యుని కోటా నిధులు ఖర్చుచే యలేని మధు గౌడ్, పీఆర్పీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఈరవ్ర తి అనిల్‌లకు తనను విమర్శించే హక్కులేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బులు ఓటర్లకు డబ్బులు పంచాలని గానీ, దొడ్డిదారిలో గెలవాలని గానీ తాను అనుకోలేదని.. ఇప్పుడు ఓడిపోయినా 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎల్లారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని ఆశపడ్డానని తెలిపారు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసేందుకు ముందుకు వచ్చానని స్పష్టం చేశారు. నామినేషన్ విత్‌డ్రా చే సుకునే ముందు కూడా మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, తాహెర్‌కు ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. 

కాంగ్రెస్ నేతల వద్ద తాను డిపాజిట్ చేసిన రూ. 2 కోట్లను రెండు, మూడు రోజుల నుంచి కామారెడ్డిలో ఉన్న ఎంపీటీసీ, జడ్పీటీసీలకు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు రూ. 30 వేల చొప్పు న పంచుతున్నారని సమాచారం వచ్చిందని తెలిపారు. ఓటర్ల కు డబ్బులు ఇవ్వడం ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధమన్నారు. ఒకవే ళ పంచాల్సివస్తే జిల్లాలో ఉన్న 761 మంది ఓటర్లకు 27 వేల చొప్పున పంపిణీ చేసి సమన్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇతర పార్టీలకు ఇవ్వటానికి మనసొప్పకపోతే కాంగ్రెస్ బీ- ఫారం మీద గెలిచిన 300 మందికైనా 67 వేల చొప్పున పంపిణీ చేయాలని అన్నారు. అదికూడా న చ్చకపోతే ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్న 134 మందికి రూ. 1.50 లక్షల చొప్పున పంపకాలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ముఖ్యనేతలు లాలూచీ పడకుండా ఓటర్లకు న్యా యం చేయాలనే తపన ఉంటే ఏమైనా డబ్బులు తక్కువ పడితే కూడా తాను సర్దుబాటు చేసేందుకు సిద్ధం గా ఉన్నానన్నారు.

తన డబ్బులు తనకు ఇవ్వడం లేకుంటే జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సొంత భవనం లేదని, రూ.2 కోట్లతో తన పేరుపై డీసీసీ భవన్ నిర్మించినా సమ్మతమేనన్నారు. తాను డిపాజిట్ చేసిన రూ. 2 కోట్లలో కేవలం షబ్బీర్‌అలీ రూ. 40 లక్షలు వ్యక్తిగత అవసరాలకు వాడుకోవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. కామారెడ్డిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆస్తులకు తమ కుటుంబం 1960 నుంచి గార్డియన్‌గా ఉన్నదని రూ. 70 లక్షల విలువచేసే ఫిక్సుడు డిపాజిట్లు, మూడు బీరువాల డాక్యుమెంట్లు, భూములు ఆస్తులను ప్రభుత్వానికి అప్పగించిన చరిత్ర తనదని, పైసల కోసం కక్కుర్తిపడే చరిత్ర వారిదని ధ్వజమెత్తారు.

No comments:

Post a Comment

Powered by Blogger.

About The Soonex

>> <<

Get in Touch

Your e-mail address is incorrect. Please check it and try again.

Thanks for your subscription!

ప్రకటన

ప్రకటన

Select a Date

క్యాలెండర్ ఆవిష్కరణ

Ad Space

ప్రకటన

ప్రకటన

Ad Space

E-Paper

Select a Date to View Old Edition

Popular Post

ప్రకటన

Ad Space

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks