నల్గొండ జిల్లాలో ప్రారంభమైన శర్మీల పరామర్శ యాత్ర
వైఎస్ జగన్, శర్మీల ఓదార్పు యాత్రలంటే జనం తండోపతండాలుగా వచ్చేవారు...వారు ఏం మాట్లాడుతారో వినేందుకు ఉత్సహాన్ని కనబర్చే వారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి తనయులను చూసేందుకు వచ్చిన జనాన్ని కంట్రోల్ చేయడం ఎవరితరం అయ్యేది కాదు...ఇదంతా ఒకప్పుటి మాట. ఇప్పుడు ప్రజల్లో స్పందన కరువైంది. నలుగురైదుగురు వైఎస్ఆర్సీపి కార్యకర్తలు తప్ప ఎవరూ కనిపించడం లేదు. తాజాగా నల్గొండ జిల్లాలో ప్రారంభమైన శర్మీల పరామర్శ యాత్ర చప్పగా సాగుతోంది. ప్రజల్లో పెద్ద గా స్పందన కనిపించడం లేదు.
తెలంగాణా ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో వైఎస్ జగన్ సమైకాంధ్రకు మద్ధతుగా నిర్ణయం తీసుకున్నారు. తమ పార్టీ సమైక్యాంధ్రకే కట్టుబడి ఉందని ప్రకటించారు. దీంతో తెలంగాణా వాదులందరికి కోపం వచ్చింది. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నందుకు తెలంగాణా ప్రాంతానికి చెందిన వైఎస్ఆర్సీపి నేతలు కూడా మూకుమ్మడి రాజీనామాలు చేశారు. దీంతో తెలంగాణా ప్రాంతంలో వైఎస్ఆర్సీపి దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. ఈ నేపధ్యంలో తెలంగాణా ప్రాంతంలో ఉనికి చాటుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది వైఎస్ఆర్సీపి.
2013 ఫిబ్రవరి లో మరో ప్రస్థానం పేరుతో నల్గొండ జిల్లాలో పాదయాత్ర చేపట్టారు. ఆ సమయంలో ప్రజల నుంచి విషేశ స్పందన లభించింది. శర్మీలను చూసేందుకు...ప్రసంగాన్ని వినేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు.
అనేక కారణాల వల్ల ఓదార్పు యాత్రను నిలిపివేసిన వైఎస్ఆర్సీపి పరామర్శ యాత్ర పేరుతో మళ్లీ మొదలు పెట్టింది. ఈ సారి జగన్ కు బదులుగా షర్మీలా బయలుదేరింది. ఇందులో భాగంగా నల్గొండ జిల్లాలో వారం రోజుల పాటు పరామర్శ యాత్ర కు పూనుకుంది. మొదటి రోజు దేవరకొండ నియోజవకవర్గంలోని మూడు కుటుంబాలను పరామర్శించింది. రెండో రోజు నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని మూడు కుటుంబాలను పరామర్శించింది శర్మీలా. మూడో రోజు మిర్యాలగూడ నియోజకవర్గంలోని నాలుగు కుటుంబాలను శర్మీలా పరామర్శించనుంది. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ ప్రజల నుంచి పెద్దగా స్పందన కనిపించలేదు. జనం కంటే...తోడు వచ్చిన వాహనాల సంఖ్య ఎక్కువగా కనిపించింది. శర్మీలా వెంట వచ్చిన కొంతమంది వైఎస్ఆర్సీపి నాయకులతో పాటు ప్రయివేటు సెక్యూరిటీ చేసే హడావుడి తప్ప జనం సందడి కనిపించడంలేదు. ఇదిలా ఉండగా నాగార్జునసాగర్ లో షర్మీలాను అడ్డుకునే ప్రయత్నం చేశారు తెలంగాణా వాదులు. తెలంగాణా రాష్ట్రం కోసం ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను కూడా పరామర్శించాలని డిమాండ్ చేశారు.
మొత్తానికి ఐసియులో ఉన్న వైఎస్ఆర్సీపికి మళ్లీ ప్రాణంపోసే ప్రయత్నాలు చేస్తున్నారు ఆ పార్టీ నాయకత్వం.


No comments:
Post a Comment