పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది ఆ శైవ క్షేత్రం.
నల్గొండ జిల్లాలోని శివాలయం
శివుని జఠాజూటం నుంచి నిత్యం నీళ్లు రావడం...ప్రతి 120 సంవత్సరాలకు బెత్తెడు లింగం పెరడం వంటి మహిమలతో పాటు భక్తుల కోరికలు తీర్చే పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది ఆ శైవ క్షేత్రం. ఘన చరిత్ర కలిగి ఎన్ని మహిమలు కలిగిన నల్గొండ జిల్లాలోని శివాలయం
జిల్లాలోని మేళ్లచెర్వు మండల కేంద్రంలోని ఇష్టకామేశ్వరి సమేత స్వయంబు శంభులింగేశ్వర స్వామి దేవస్థానం దక్షిణ కాశీ క్షేత్రంగా విరాజిల్లుతోంది. మేళ్లచెర్వు మండల కేంద్రంలోని ఈ శైవక్షేత్రం తెలంగాణా వ్యాప్తంగా ప్రసిద్ధి గాంచింది. కాకతీయుల కాలంలో వెలసిన దేవాలయానికి అనేక మహిమలున్నాయి.
నల్గొండ జిల్లాలోని శివాలయం
శివుని జఠాజూటం నుంచి నిత్యం నీళ్లు రావడం...ప్రతి 120 సంవత్సరాలకు బెత్తెడు లింగం పెరడం వంటి మహిమలతో పాటు భక్తుల కోరికలు తీర్చే పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది ఆ శైవ క్షేత్రం. ఘన చరిత్ర కలిగి ఎన్ని మహిమలు కలిగిన నల్గొండ జిల్లాలోని శివాలయం
జిల్లాలోని మేళ్లచెర్వు మండల కేంద్రంలోని ఇష్టకామేశ్వరి సమేత స్వయంబు శంభులింగేశ్వర స్వామి దేవస్థానం దక్షిణ కాశీ క్షేత్రంగా విరాజిల్లుతోంది. మేళ్లచెర్వు మండల కేంద్రంలోని ఈ శైవక్షేత్రం తెలంగాణా వ్యాప్తంగా ప్రసిద్ధి గాంచింది. కాకతీయుల కాలంలో వెలసిన దేవాలయానికి అనేక మహిమలున్నాయి.
1126వ సంవత్సరంలో ఈ దేవాలయం వెలసినట్లు చరిత్ర చెబుతోంది. ఓరుగల్లు నుంచి ఈ ప్రాంతానికి వలస వచ్చిన స్వామి వారు ఆవుల మందలో జన్మించినట్లు చరిత్రలో ఉంది. ఈ దేవాలయంలో శివుడు ఆర్థనారీశ్వరుని ఆకారంలో ఉంటాడు. అంతేగాకుండా శివుని జఠాజూటం నుంచి నిత్యం నీళ్లు వస్తూనే ఉంటాయి. ఎన్ని నీళ్లు తీస్తే అన్ని నీళ్లు మళ్లీ పుట్టుకొస్తూనే ఉంటాయి. అన్నింటి కంటే అధ్బుతమైన విషయం ఏమిటంటే ప్రతి 120 సంవత్సరాలకు ఓ సారి బెత్తెడు లింగం పెరుగుతుందని స్థానికులు చెబుతున్నారు.
ఘన చరిత్ర కలిగిన ఈ శివాలయాన్ని మనస్పూర్తిగా దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. ముఖ్యంగా సంతానం లేని వారికి స్వామి వారు పిల్లలను ప్రసాదిస్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా శివరాత్రి సందర్భంగా ఈ శైవక్షేత్రం భక్త జన సంద్రంగా మారుతుంది.
భక్తుల కోరికలు తీరుస్తూ దక్షిణ కాశీ క్షేత్రంగా విరాజిల్లుతున్న ఈ ఇష్టకామేశ్వరి సమేత స్వయంబు శంభులింగేశ్వర స్వామి దేవాలయం భక్తుల ఇష్ట దైవంగా మారింది. అందుకే ఈ పుణ్యక్షేత్రానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిపోతున్నారు భక్తులు.


No comments:
Post a Comment