Follow Us:

RSS

Wellcome to Our Website

We are working on our website design. We are sure this new website will completely blow your mind! Subscribe by entering your e-mail below to stay updated on our progress.

Launching
comeback
launchpad

Wednesday, 20 May 2015

సంగారెడ్డి : భక్తులకు సౌకర్యాలు కల్పించాలి -డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌ రెడ్డి





 భక్తులకు సౌకర్యాలు కల్పించాలి -డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌ రెడ్డి
-రూ.12 లక్షలతో నిర్మిచనున్న పలు పనులకు శంకుస్థాపన

సంగారెడ్డి : ఏడుపాయల వనదుర్గభవాని మాత ఆలయ ప్రాశస్త్యాన్ని రాష్ట్రవ్యాప్తంగా చాటేందకు వీలుగా అభవృద్ది పనులు చపట్టాలని అసెంబ్లి డీప్యూటీ స్పీకర్‌ ఎం పద్మాదేవేందర్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏడు పాయల ఆలయ అభివృద్ది పై బుదవారం ఆలయ ప్రాంగణంలో ఆమె సమావేశం నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ చారిత్రాక పరంగా పర్యాటక పరంగా ఎంతో ముఖ్యమైన వనదేవత ఆలయాన్ని ఆలయ దర్శనానికి వచ్చే భక్తులకు తగిన వసతులు కల్పించాలని అన్నారు. ఆలయ సమగ్ర అభివృద్దికి శ్రీకారం చుట్టడం జరిగిందని, అందులో భాగంగా ఇటీవల హైదరాబాద్‌లో సంబంధఙత ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించామని చెప్పారు. ఆ సమావేశం కొనసాగింపుగా బుధవారం పనులు చేపట్టే విషయమై ఆలయ సందర్శనలో పాటు సమీక్ష నిర్వహింస్తున్నామన్నారు. వివిధ శాఖల సమన్వయంతో పనిచేస్తూ అభివృద్ది పనులు చేపట్టాలని, ఏడుపాయలలో నూతన యాగశాల నిర్మాణం పాఠశాల, అన్నదాన సత్రం, మూడు ధర్మశాలలు, స్నానఘటాలు, మరుగుదొడ్లు, నిర్మాణం కేశఖండన కోరకు ఏర్పాట్లు క్యూ కాంప్లెక్స్‌ నిర్మాణం వంటి పనులు అభివృద్ది పనులలో ఉన్నాయని తెలిపారు. సత్వరమే అంచనాలు, ప్రతిపాదనలు సిద్దం చేయాలని ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని తెలిపారు. అంతేకాకుండా భక్తులు తొందరగా దర్శనం చేసుకోనేలా అమ్మవారు భక్తులకు స్పష్టంగా అగుపించేలా చర్యలు తీసుకోవాలని, సాంస్కృతిక కార్యక్రమాలు కళాప్రదర్శనలు నిర్వహించేందుకు కళామండపం నిర్మంచాలని సూచించారు. అంతకుముందు డిప్యూటీ స్పీకర్‌ ఆలయసమీపంలో 12 లక్షలతో నిర్మంచనున్న మురుగుకాలువల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. నాగసానిపల్లిలో 1924లో నిర్మాణమైన నీటిపారుదల శాఖ అతిథిగృహం ప్రస్తుతం వినియోగంలో లేదని దానిని వినియోగంలోకి తేవాలని సంబంధిత ఇ.ఇ.కి ఆమె సూచించారు. నాగసాని పల్లె లోని ఈ అతిథిగృహాన్ని ఆమె ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం ఐ.కె.పి. కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కొనుగోళ్లు జరుగుతున్న తీరును ఆమె మహిళలను అడిగి తెలుపుకొన్నారు. ఈ కార్యక్రమంలో డి.ఆర్‌,డి.ఏ. ప్రాజెక్టు డైరెక్టర్‌ సత్యనారాయణరెడ్డి, ఆర్డీఓ ఎం.నగేశ్‌, డి.ఎప్‌ ఓ శివానిడొంగే, ఇబిఇ.ఇ. ఏశయ్య, ఆలయ ఇ.ఉ వెంటేట క్రిష్టరావు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment

Powered by Blogger.

About The Soonex

>> <<

Get in Touch

Your e-mail address is incorrect. Please check it and try again.

Thanks for your subscription!

ప్రకటన

ప్రకటన

Select a Date

క్యాలెండర్ ఆవిష్కరణ

Ad Space

ప్రకటన

ప్రకటన

Ad Space

E-Paper

Select a Date to View Old Edition

Popular Post

ప్రకటన

Ad Space

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks