-బ్రహ్మచారులుగా మిగిలిపొండి
-గర్భస్రావాలు భ్రూణహత్యలకు దారితీస్తున్నాయి
-అధ్యాత్మిక మతగురువు శంకరాచార్య సరస్వతి సంచలన వ్యాఖ్యలు
భోపాల్, జనవరి 31: ఒకవేళ పిల్లలు వద్దనుకుంటే దంపతులు శృంగారంలో పాల్గొనకూడదని ద్వారక పీఠాధిపతి, అధ్యాత్మిక మతగురువు శంకరాచార్య స్వరూపానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. పిల్లలు కనాలని లేకపోతే బ్రహ్మచారులుగా ఉండండి అంటూ ఆయన తీవ్రంగా స్పందించారు. భారతదేశంలో భ్రూణహత్యలకు గర్భస్రావాలు చట్టబద్దతను కల్పిస్తున్నాయని ఆయన అన్నారు. వైద్యపరమైన గర్భస్రావాలను నిషేధించాలని ఆయన పిలుపునిచ్చారు. మూడునెలలలోపు గర్భాన్ని తొలగించుకోవచ్చనే ప్రభుత్వ నిబంధనను శంకరాచార్య తప్పుపట్టారు. బ్రిటన్లో గర్భం తొలగించుకోవడం తీవ్రనేరమని, అందుకు మరణశిక్ష కూడా విధిస్తారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. హిందూ మతసంస్థలు ఎక్కువ మందిని పిల్లలనుకనాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో శంకరాచార్య తాజా వ్యాఖ్యలు చేయడం గమనార్హం


No comments:
Post a Comment