మాజీ మంత్రి కొమటి రెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి కేసిఆర్ పై ఫైర్
నల్గొండ : మొన్నటి వరకు నిశబ్దాన్ని పాటించిన మాజీ మంత్రి కొమటి రెడ్డి వెంకటరెడ్డి మళ్లీ గళమిప్పారు. ఏకంగా ముఖ్యమంత్రి కేసిఆర్ పై ఫైర్ అయ్యారు. కెసిఆర్ పాలన చూస్తుంటే అసలు తెలంగాణా ఎందుకు వచ్చిందనే బాధ కలుగుతోందని చెప్పారు. అలాగే రోజుకో ప్రకటన చూసి ప్రజలు ఆశలు వదులుకొని తిరగబడే రోజులు వచ్చాయని అన్నారు. అంతేగాక సెక్రటరియేట్, రవీంద్రభారతీలు మార్చడం సరైంది కాదని...కుల సంఘాల భవన నిర్మాణాలకు కూడా ఇది సరైన సమయం కాదని అన్నారు కోమటిరెడ్డి. అసెంబ్లీ సమావేశాల్లోనూ సిఎం ను నిలదీస్తామన్నారు.


No comments:
Post a Comment