Follow Us:

RSS

Wellcome to Our Website

We are working on our website design. We are sure this new website will completely blow your mind! Subscribe by entering your e-mail below to stay updated on our progress.

Launching
comeback
launchpad

Saturday, 14 February 2015

నల్గొండ : సమసిన రెండు తెలుగు రాష్ట్రాల జలవివాదం.

సమసిన  రెండు తెలుగు రాష్ట్రాల  జలవివాదం

నల్గొండ :  గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల మద్య నెలకొన్న జలవివాదం ప్రస్తుతానికి సమసిపోయింది. ఆంధ్రప్రదేశ్ లోని పంటలకు సాగునీటి అవసరాలకు పది టిఎంసిల నీటిని విడుదల చేయాలని, అలాగే కుడికాలువ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ ను తెలంగాణా అవసరాలకు ఇవ్వాలనే ఒప్పందం ఇరు రాష్ట్రాల మద్య జరిగింది. దీంతో జలవివాదానికి సంబంధించి తాత్కాలికంగా ఓ స్పష్టత వచ్చిందని చెప్పవచ్చు. నీటి వినియోగంపై ఉన్న అపోహలు,అనుమానాలు కూడా తీరే అవకాశం ఉంది.
రాష్ట్ర విభజన తర్వాత నాగార్జునసాగర్ కేంద్రంగా రెండు రాష్ట్రాల మధ్య జలవీవాదం రగులుతూనే ఉంది. గత ఏడాది అగస్టులో సాగర్ కు పెద్ద ఎత్తున వరదలు వచ్చినప్పటికీ ఖరీఫ్ పంటకు కుడి,ఎడమ కాలువలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగునీరివ్వడం జరిగింది. అయితే అదే ఖరీఫ్ పంటకు మూడో జోన్ కు ఈ నెలాఖరు వరకు కుడి,ఎడమ కాల్వలకు ఇంకా నీరు అందించాల్సి ఉంది. అయితే కుడి కాలువకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటి కేటాయింపు కన్నా అధికంగా నీరు వాడుకుందని తెలంగాణా ప్రభుత్వం ఆరోపించింది. తెలంగాణా ప్రభుత్వమే వాటాకు మించి నీటిని వాడుకుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదిస్తోంది. అయితే విభజన తర్వాత నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్వహణ తెలంగాణా ప్రభుత్వానికి అప్పగించింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఆంధ్రప్రదేశ్ కు ఎన్ని నీళ్లు కావాలనే విషయం స్పష్టం చేయకపోవడంతో తెలంగాణా ప్రభుత్వం కుడి కాలువ ద్వారా నీటిని నిలిపివేసింది. దీంతో ఈ వివాదం తారాస్థాయికి చేరుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం పొట్ట దశలో ఉన్న ఆరు లక్షల ఎకరాలకు మరో ఆరు వేల క్యూసెక్కుల నీరు విడుదల చేయాలని నిన్న(శుక్రవారంనాడు) ఆ రాష్ట్రానికి చెందిన అధికారులు తెలంగాణా అధికారులను కోరారు. అయితే తెలంగాణా ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎస్ఈ తెలిపారు. దీంతో వెనుదిరిగి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ అధికారులు కొద్దిసేపటి తర్వాత పోలీసులతో కలిసి వచ్చారు. తమకు ఆరువేల క్యూసెక్కుల నీటిని వెంటనే విడుదల చేయాలని లేని పక్షంలో తామే గేట్లు ఎత్తుకుంటామని వాదించారు. దీంతో ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారుల మధ్య వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రక్తంగా మారడంతో ఇరు రాష్ట్రాల పోలీసులు కూడా రంగ ప్రవేశం చేశారు. పోలీసుల మధ్య కూడా వాగ్వాదం జరిగి ఘర్షణకు దారితీసింది. డ్యాం సాక్షిగా ఇరు రాష్ట్రాల పోలీసులు ఒకరి పై ఒకరు లాఠీలు ఝులిపించుకున్నారు. దీంతో ఒక్క సారిగా రెండు తెలుగు రాష్ట్ర్రాలు ఉలిక్కిపడ్డాయి.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఫోన్లో సంప్రదించుకొని...ఈ రోజు(శనివారం నాడు) గవర్నర్ సమక్షంలో మధ్యే మార్గంగా ప్రస్తుతానికి రాజీ మార్గానికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ అవసరాల కోసం పది టిఎంసిల నీటిని విడుదల చేయాలని, అలాగే ఉత్పత్తయ్యే విద్యుత్ ను తెలంగాణా రాష్ట్రానికి ఇవ్వాలని ఇరు రాష్ట్రాలు ఓ అవగాహనకు వచ్చారు. శనివారం సాయంత్రం ఇరు రాష్ట్రాల అధికారుల సమక్షంలో కుడి కాలువ ద్వారా ఏడు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అలాగే గత రెండు రోజులుగా ప్రాజెక్టు వద్ద ఉన్న పోలీసులను ఇరు రాష్ట్రాలు వెనక్కి పిలిపించుకున్నాయి. ఇక రబి పంటకు సంబంధించిన నీటి విషయంలోనూ ఇరు రాష్ట్రాల సంబంధించిన ఇరిగేషన్ అధికారులే పూర్తి బాధ్యత వహించి నిర్ణయాలు తీసుకునేటట్లు, సాగర్ డ్యాం భద్రత ప్రస్తుతం ఉన్న ఎస్ పి ఎఫ్ బలగాలు నిర్వహించే విధంగా చూడడంతో పాటు భవిష్యత్తులోనూ సిఐఎస్ఎఫ్ బలగాల సహాయం తీసుకునేలా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయానికి వచ్చాయి.
మొత్తానికి అధికారుల ఘర్షణతో తారాస్థాయికి చేరుకున్న సాగర్ పంచాయతీ...రెండు రాష్ట్రాల సిఎంలు ముందుకు రావడంతో సమస్య సునాయసంగా పరిష్కారమైంది. అయితే ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదం తాత్కాలికంగా మాత్రమే సమసిందని చెప్పవచ్చు. ప్రాజెక్టులు నీళ్లు తగ్గుతున్నా కొద్ది రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలు పెరుగుతున్నాయి. అలాంటి సమయంలో రెండు రాష్ట్రాలు కూడా సంయమనం పాటించి...రెండు రాష్ట్రాలకు మేలు జరిగేలా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

No comments:

Post a Comment

Powered by Blogger.

About The Soonex

>> <<

Get in Touch

Your e-mail address is incorrect. Please check it and try again.

Thanks for your subscription!

ప్రకటన

ప్రకటన

Select a Date

క్యాలెండర్ ఆవిష్కరణ

Ad Space

ప్రకటన

ప్రకటన

Ad Space

E-Paper

Select a Date to View Old Edition

Popular Post

ప్రకటన

Ad Space

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks