నాగార్జున సాగర్ నీటి పంపకం పై రోజుకో వివాదం తలెత్తుతోంది.
file photo nagarjuna sagar
గత వారం రోజుల క్రితం డ్యాం లో సగభాగం మాకే చెందుతుందని ఏపి నీటిపారుదల శాఖ, నాగార్జునసాగర్ డ్యాం అదికారులకు లేఖ రాయడం వివాదంగా మారింది. అది పూర్తిగా సమసిపోక ముందే మరో వివాదం తెరపైకి వచ్చింది. నీటి పంపకాల ప్రకారం ఇప్పటికే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కువగా వాడుకోవడంతో కుడికాలువకు నీటి విడుదలను నిలిపివేశారు......మరో పక్క రోజురోజుకు డ్యాంలో నీటినిలువలు పడిపోతుండడంతో కుడికాలువ విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి కూడా నీరు అందని పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కుడికాలువ ద్వారా నీటిని విడుదల చేస్తోంది. ఇలా చేస్తే టర్బైన్లు దెబ్బతినే ప్రమాదం ఉంది.
తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం తారాస్థాయికి చేరింది. సాగర్ నుంచి నీటి విడుదలపై ఇరు రాష్ట్రాల మధ్య మొదలైన గొడవ నిన్న ఎపికి నీటిని ఆపేసే వరకు వెళ్లింది. డెల్టాలో సుమారు ఆరు లక్షల ఎకరాల్లో ున్న పంటను కాపాడేందుకు ఇప్పుడు ఏపి ప్రభుత్వం పెద్ద సాహసమే చేస్తోంది. కుడికాల్వల నుంచి నీటి విడుదలను ఆపేయడంతో విద్యుత్ ఉత్పత్తిని ఆరంభించింది. కుడి విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించాలంటే..సాగర్ లో నీటి మట్టం కనీసం 533.30 అడుగుల వరకు ఉండాలి. అయితే ప్రస్తుతం కేవలం 530.30 అడుగుల వరకే నీరు ఉన్నాయి. ఈ దశలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభిం చేస్సే పవర్ స్టేషన్ లో ని టర్బయిన్లకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. ఇప్పటి వరకు సాగర్ చరిత్రలో ఈ స్థాయిలో నీటిమట్టం ఉండగా విద్యుత్ ఉత్పత్తి చేయలేదు. కాల్వల నుంచి నీరు రాకపోవడంతో విద్యుత్ ఉత్పత్తి కోసం సాగర్ నుంచి తీసుకున్న నీటిని టర్బయిన్లు కాల్వలోకి వదులుతాయి. ఆ నీరే డెల్టాకు వెళుతుంది. దీంతో తెలంగాణా అధికారులు కంగుతిన్నారు. ఎందుకంటే మొన్నటి వరకు కుడి కాల్వల ద్వారా రెండు వేల క్యూసెక్కుల నీటినే విడుదల చేసేవారు. ఇప్పుడు విద్యుత్తు టర్బయిన్ల ద్వారా పవర్ హౌస్ లోకి నాలుగు వేల క్యూసెక్కుల నీరు వెళుతోంది. దీంతో వారికి ఏం చేయాలో తెలియడం లేదు. ఒకవైపు టర్బయిన్లను బలిపెట్టి విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది ఆంధ్రప్రదేశ్...మరోవైపు రెండు వెల క్యూసెక్కులకు బదులు నాలుగు వేల క్యూసెక్కులను కోల్పోతోంది తెలంగాణా. చివరకు జల వివాదం రణరంగంగా మారింది. మంత్రులు అధికారుల సాయంతో ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు.
రెండు రాష్టాలు విడిపోయిన తరువాత ఉమ్మడి ప్రాజెక్టుగా ఉన్న నాగార్జునసాగర్ నీటి పంపకాల విషయంతో ప్రతి రోజు ఏదో ఒక గలాట జరుగుతూనే ఉంది......పునర్విభజన చట్టం ప్రకారం శ్రీశైలం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేషన్ ఏపీకి బదలాయించగా...నాగార్జునసాగర్ మెయింటనెన్స్ తెలంగాణా ప్రభుత్వం చూసుకుంటుంది.... దీంట్లో భాగంగానే నాగార్జున సాగర్ రిజర్వాయర్ మొత్తం నీరు 552 టీఎంసీలలో ....ఆంద్రప్రదేశ్ 322 టీఎంసీలు, తెలంగాణా 239.5 టీఎంసీల మేరు నీరు వాడుకోవాలని వాటాలు కేటాయించారు.....అయితే ఏపీ ఇప్పటికే అదనంగా 42 టీఎంసీలను వాడుకుందని ఎన్నెస్పీ అదికారులు తెలంగాణా ప్రభుత్వం ద్రుష్టికి తీసుకొచ్చారు........ఏపీకి చెందిన కుడికాలువకు 132 టీఎంసీలు మేర నీటి కేటాయింపులుండగా....138టీఎంసీలు వాడుకున్నారని, క్రుష్ణా డెల్టా లో సైతం 152టీఎంసీల మేర నీటిని వాడుకునే అవకాశం ఉండగా, 170టీఎంసీలను వాడుకున్నరని అదికారులు ప్రభుత్వానికి చెప్పారని సమాచారం...తెలంగాణ తనకు దక్కే 239.5 టీఎంసీల నీటితో కేవలం 137 టీఎంసీల మేర వాడుకుందని , ఇదిపోను మరో 102 టీఎంసీల నీటిని తెలంగాణా వాడుకునే హక్కుఉందని ఈలెక్కన ప్రస్తుతం లభ్యతగా ఉన్న 51 టీఎంసీలు పూర్తిగా తెలంగాణాకే దక్కుతాయని ఎన్నెస్పీ అదికారులు చెపుతున్నారు...వాటాకు మించి వాడుకున్నందున ఏపీకి కుడికాలువ కింద నీరివ్వరాదని నిర్ణయించారు....కాగా ఏపీ తన అవసరాల కోసం లిఖిత పూర్వకంగా అర్జీ పెట్టుకుంటే కొంత నీటిని విడుదల చేసే అవకాశాలను పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయిచింది...
ప్రస్తుతం నాగార్జునసాగర్ లో నీటి మట్టం 532.20 అడుగులు ఉండగా.....నిన్న రాత్రి నుండి రైట్ కెనాల్ పై ఉన్న విద్యుత్ కేంద్రానికి 2000 క్యూసెక్కుల నీరు, లెఫ్ట్ కెనాల్ కి 8015 క్యూసెక్కుల నీరు, ఎస్ ఎల్బీసీ 1500 నీటిని విడుదల చేస్తున్నారు...అయితే 530 అడుగుల నీరు ఉన్న క్రమంలో రైట్ కెనాల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో విద్యుత్ ఉత్పాదన సాద్యం కాదు....ఒకవేళ ఈ నీటి మట్టంపైనే విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తే టర్బైన్లు చెడిపోయి వైబ్రేషన్ వచ్చే ప్రమాదముంది....దీంట్లో బాగంగానే రెండు రోజుల క్రితం ఏపీ అదికారులు రైట్ కెనాల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి నీటిని నిలుపుదల చేశారు.....కాని మళ్లీ గురువారం ఉదయం నుండి యదావిదిగా విద్యుత్ ఉత్పత్తిని ప్రారంబించారు.....దీంతో నీటి కోసం ఇరురాష్టాల మద్య వివాదాలు , ఘర్షణలు ,మొండిపట్టింపులు ..ప్రపంచంలోనే అతిపెద్దదైన నాగార్జునసాగర్ ప్రాజెక్టుకే ముప్పును తెచ్చిపెట్టే ప్రమాదం లేకపోలేదు....



No comments:
Post a Comment