ప్రసాదం ధరను పెంచి భక్తుల ఫై భారం
నల్గొండ : ప్రసాదం ధరను పెంచి భక్తులపై బారాన్ని పెంచింది శ్రీలక్ష్మినరసింహ్మ స్వామి దేవస్థానం... లడ్డూ ప్రసాదం,పులిహారతో పాటు వడ రేటునుకు కూడా పెంచేసింది. మొన్నటి వరకు పది రూపాయలు విక్రయించే లడ్డూ ప్రసాదాన్ని పదిహేను రూపాయలకు...ఐదు రూపాయలు ఉన్న పులిహారను పది రూపాయలకు అలాగే పది రూపాయలున్న వడను పదిహేను రూపాయలుగా ధరలు పెంచారు దేవస్థానం అధికారులు. భక్తులకు ఎంతో ఇష్టమైన ప్రసాదం ధరలు పెంచి భారం మోపడం సరైంది కాదనే ఆరోపణలు వస్తున్నాయి. మరో వైపు ఇప్పటికే దేవస్థానం ప్రసాదం ధర విషయంలో కొంత నష్టాన్ని భరిస్తోందని...భక్తుల రద్దీ పెరగడంతో ఆ నష్టం మరింత పెరిగిందని తప్పని సరి పరిస్థితుల్లో ధరలు పెంచాల్సి వచ్చిందని ఈ ఓ గీతారెడ్డి చెబుతున్నారు.


No comments:
Post a Comment