టిఆర్ఎస్ లో తన్నులాట
నల్గొండ జిల్లా : టిఆర్ఎస్ లో తన్నులాట మొదలైంది... సాత,కొత్త నేతల మధ్య పొసగని పరిస్థితి ఏర్పడింది. కొన్ని నియోజకవర్గాల్లో బడా నేతలే ఎవరికి వారన్నట్టు ఉండగా...చాలా నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలు సాగుతున్నాయి. సభ్యత్వ నమోదు, అధికారిక కార్యక్రమాల్లో అవి బట్టబటలవుతున్నాయి...
జిల్లాలో ప్రస్తుతం టిఆర్ఎస్ లో తన్నులాటలు మొదలయ్యాయి....కొన్ని నియోజకవర్గాల్లో బడా నేతలే ఎవరికి వారన్నట్టు ఉండగా, అనేక నియోజకవర్గాల్లో మండలాల్లో రెండు గ్రూపులుగా కొనసాగుతున్నారు. సభ్యత్వ నమోదు, క్రమంలో ఓపికతో ఉన్న నేతలు అవకాశం దొరక్కపోతే ఏం చేయాలనే విషయంలో స్పష్టంగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే పనులు , పదవుల విషయంలో నువ్వా-నేనా అన్నట్టు నివురు గప్పిన నిప్పులా ఉన్నారు. జిల్లా పెద్దలు అధిష్టానంలో పెద్దల వద్ధ ఎవరికి వారు రాయబారం కొనసాగిస్తూ ఉనికి చాటుకునే పనిలో ఉన్నారు.
మునుగోడు నియోగవర్గంలో ఎంఎల్సీ కర్నే ప్రభాకర్, ఎంఎల్ఎ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిల మధ్య ఏ మాత్రం పొసగడం లేదు. నియోజకవర్గంలో ఒకరు హాజరైన కార్యక్రమానికి మరొకరు హాజరయ్యే పరిస్థిత లేదు. ఎంపి, ఎంఎల్ఎ,ఎంఎల్సీ ఊ ముగ్గురు కలిసి వెళ్లే పరిస్థితి లేదు. ఇదిలా ఉంటే మరో వేత వేనేపల్లి వెంకటేశ్వరరావుది మరో దారి... భువనగిరి నియోజకవర్గంలో ఎంఎల్ఎ పైల్ల శేఖర్ రెడ్డి, ఎంపి బూర నర్స్యగౌడ్ ల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. వీరు ఇరువురి మధ్య క్రమంగా వర్గ పోరు రాజుకుంటోంది. ఆ మధ్య ఇరు గ్రూపుల మధ్య తోపులాట కూడా చోటుచేసుకుంది. మమరోమారు ఎంఎల్సీ స్ధానాన్ని ఆశిస్తున్న నేతి విద్యాసాగర్ ప్రస్తుతం వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. అనుకున్న పదవి కావాలంటే అందరి మద్ధతు ఉండాలి కదా...అన్న ఆలోచనే దీనికి కారణమని తెలుస్తోంది. ఫలితంగా నకిరేకల్ నియోజకవర్గంలో ఎంఎల్ఎ వీరేశం ఆలోచనల మేరకు అక్కడ ముందుకు వెళుతున్నారు. నార్కెట్ పల్లి మండలంలో స్థానిక నేతల మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఇది ఆ నియోజకవర్గంలో టిఆర్ఎస్ కు ఇబ్బందికర పరిణామంగా మారింది.
ఇక తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రతి మండలంలోనూ రెండు గ్రూపులుగా నేతలున్నారు. నియోజకవర్గ స్తాయిలో అంతా కిశోర్ వైపే ఉన్నారు. నేనంటే నేను...అన్న సమస్య తో కొంత ఎడమోహం పెడమోహంగా ఉన్నారు. మంత్రి జన్మస్థానం కావడంతో పోలీసు, రెవెన్యూ అధికారుల విషయంలో ఆయన ముద్రలు కనిపించడాన్ని స్థానిక నేతలు జీర్ణించుకునే పరిస్థితి లేదు. స్థానిక నేతల మాటను వారు పూర్తిగా ఖాతరు చేసే పరిస్తితి లేదు. నల్గొండ నియోజకవర్గంలో అత్యధిక భాగం ఇన్న ఛార్జీ దుబ్బాక నర్సింహ్మారెడ్డి కనుసన్నుల్లోనే కొనసాగుతోంది. తిప్పర్తి,నల్గొండ పట్టణంలో కొన్ని చోట్ల చకిలం అనిల్ కుమార్, కనగల్ లో కొన్ని గ్రామాల్లో ఛాడా కిషన్ రెడ్డి ల ప్రభావం ఉంది.
జిల్లాలో తమకు సరైన ప్రాతనిధ్యం...గౌరవం లభించడం లేదని ఇద్దరు కీలక నేతలు అధిష్టానం వద్ద మోరపెట్టుకున్నట్లు సమాచారం. నియోజకవర్గాలు పెరుగుతాయి, ఇద్దరు నేతలు ఉన్న చోట ఇబ్బంది ఉండదని కేసిఆర్ హామీ ఇవ్వడంతో కొంత భరోసాతో ఉన్నారు. అయితే అధినేత ప్రకటనకు భిన్నంగా ఇప్పట్లో నియోజకవర్గాల పునర్విభజన ఉండదని ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి కుండబద్దలు కొట్టడంతో అసమ్మతి నేతల్లో గుబులు మొదలైంది. నామినేటెడ్ పదవులు పందేరం నేపధ్యంలో ఎనిమిది నెలల సహనానికి ఎప్పుడు ఊరడింపు లభిస్తుందోనన్న ఆశతో ఉన్నారు. మొత్తానికి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ తరహాలోనే ఆయా నియోజకవర్గాల్లో వర్గపోరు కొనసాగుతోంది.
మంత్రి జగదీశ్ రెడ్డి నియోజకవర్గమైన సూర్యాపేటలో పాతకొత్త నేతల మధ్య అసమ్మతి నివురుగప్పిన నిప్పులా ఉంది. కొత్త వారి చేరికతో తమకు రావాల్సిన పదవులు, ప్రాధాన్యంలో లోటు ఏర్పడతుతుందనేది పాత కాపుల వాదన. గండూరి ప్రకాశ్ వంటి నేతలు చివరి క్షణంలో వచ్చి ఆధిపత్యం చేస్తున్నారనే మనోవేదనలో పాత నేతలున్నారు. మంత్రి ఇలాఖాలోనే గులాబి తమ్ముల్లు తన్నుకున్నారు. టిఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మంత్రి పాల్గొని వెళ్లిన వెంటనే రెండు గ్రూపులు బాహాబాహికి దిగాయి. ఒకరినొకరు తోసుకుంటూ...నువ్వెంతా..అంటే నువ్వెంతా అంటూ ఘర్ఘణకు దిగారు. దేవరకొండ నియోజకవర్గంలో బాలునాయక్ చేరికతో సమీకరణాలు మారాయి. బాలు చేరికతో పాత కాపు రాములునాయక్ పూర్తిగా మౌనంగా ఉన్నారు. జడ్పీ ఛైర్మన్, నియోజకవర్గ ఇన్ ఛార్జీ అధికార పార్టీ కావడంతో బాలునాయక్ వైపు నియోజకవర్గ నేతలు మొగ్గుచూపుతున్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో ముచ్చటగా మూడు వర్గాలు కొనసాగుతున్నాయి. జిల్లాలోనే ఇక్కడ ఆధిపత్యపోరు అగ్రభాగాన ఉంది. పాత కాపు దొంతిరెడ్డి శ్రీనివార్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ ఛార్జీ శంకరమ్మ, సీనియర్ నేత సాముల శివారెడ్డి ఎవరికి వారే అన్నట్లు ఉన్నారు. ఈ నియోజకవర్గంలోని అత్యధిక మండలాల అధ్యక్షులు పాత కాపులు దొంతిరెడ్డి నాయకత్వంలోనే ఉన్నారు. కొత్తగా చేరిన వారు శంకరమ్మ వైపు అడుగులు వేస్తున్నారు. శివారెడ్డి వైపు బలమైన సామాజిక వర్గం ఉంది. ముగ్గురు ఇలా ఉంటే గ్రందాలయ ఛైర్మన్ అల్లం ప్రబాకర రెడ్డి మరో గ్రూపుగా ఉన్నారు. ఇటీవల హుజూర్ నగర్ లో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. అసమ్మతిని దారిన పెట్టే బాధ్యతను పార్లమెంటరీ కార్యదర్శి గాదారి కిషోర్ కు బాధ్యతలు అప్పగించారు. ఆతర్వాత నేరెడుచర్ల లో ఇరు గ్రాపులు పిడి గుద్దులు గుద్దుకున్నారు...గాల్లోకీ కుర్చీలు విసురుకున్నారు.
నల్గొండ జిల్లా : టిఆర్ఎస్ లో తన్నులాట మొదలైంది... సాత,కొత్త నేతల మధ్య పొసగని పరిస్థితి ఏర్పడింది. కొన్ని నియోజకవర్గాల్లో బడా నేతలే ఎవరికి వారన్నట్టు ఉండగా...చాలా నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలు సాగుతున్నాయి. సభ్యత్వ నమోదు, అధికారిక కార్యక్రమాల్లో అవి బట్టబటలవుతున్నాయి...
జిల్లాలో ప్రస్తుతం టిఆర్ఎస్ లో తన్నులాటలు మొదలయ్యాయి....కొన్ని నియోజకవర్గాల్లో బడా నేతలే ఎవరికి వారన్నట్టు ఉండగా, అనేక నియోజకవర్గాల్లో మండలాల్లో రెండు గ్రూపులుగా కొనసాగుతున్నారు. సభ్యత్వ నమోదు, క్రమంలో ఓపికతో ఉన్న నేతలు అవకాశం దొరక్కపోతే ఏం చేయాలనే విషయంలో స్పష్టంగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే పనులు , పదవుల విషయంలో నువ్వా-నేనా అన్నట్టు నివురు గప్పిన నిప్పులా ఉన్నారు. జిల్లా పెద్దలు అధిష్టానంలో పెద్దల వద్ధ ఎవరికి వారు రాయబారం కొనసాగిస్తూ ఉనికి చాటుకునే పనిలో ఉన్నారు.
మునుగోడు నియోగవర్గంలో ఎంఎల్సీ కర్నే ప్రభాకర్, ఎంఎల్ఎ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిల మధ్య ఏ మాత్రం పొసగడం లేదు. నియోజకవర్గంలో ఒకరు హాజరైన కార్యక్రమానికి మరొకరు హాజరయ్యే పరిస్థిత లేదు. ఎంపి, ఎంఎల్ఎ,ఎంఎల్సీ ఊ ముగ్గురు కలిసి వెళ్లే పరిస్థితి లేదు. ఇదిలా ఉంటే మరో వేత వేనేపల్లి వెంకటేశ్వరరావుది మరో దారి... భువనగిరి నియోజకవర్గంలో ఎంఎల్ఎ పైల్ల శేఖర్ రెడ్డి, ఎంపి బూర నర్స్యగౌడ్ ల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. వీరు ఇరువురి మధ్య క్రమంగా వర్గ పోరు రాజుకుంటోంది. ఆ మధ్య ఇరు గ్రూపుల మధ్య తోపులాట కూడా చోటుచేసుకుంది. మమరోమారు ఎంఎల్సీ స్ధానాన్ని ఆశిస్తున్న నేతి విద్యాసాగర్ ప్రస్తుతం వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. అనుకున్న పదవి కావాలంటే అందరి మద్ధతు ఉండాలి కదా...అన్న ఆలోచనే దీనికి కారణమని తెలుస్తోంది. ఫలితంగా నకిరేకల్ నియోజకవర్గంలో ఎంఎల్ఎ వీరేశం ఆలోచనల మేరకు అక్కడ ముందుకు వెళుతున్నారు. నార్కెట్ పల్లి మండలంలో స్థానిక నేతల మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఇది ఆ నియోజకవర్గంలో టిఆర్ఎస్ కు ఇబ్బందికర పరిణామంగా మారింది.
ఇక తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రతి మండలంలోనూ రెండు గ్రూపులుగా నేతలున్నారు. నియోజకవర్గ స్తాయిలో అంతా కిశోర్ వైపే ఉన్నారు. నేనంటే నేను...అన్న సమస్య తో కొంత ఎడమోహం పెడమోహంగా ఉన్నారు. మంత్రి జన్మస్థానం కావడంతో పోలీసు, రెవెన్యూ అధికారుల విషయంలో ఆయన ముద్రలు కనిపించడాన్ని స్థానిక నేతలు జీర్ణించుకునే పరిస్థితి లేదు. స్థానిక నేతల మాటను వారు పూర్తిగా ఖాతరు చేసే పరిస్తితి లేదు. నల్గొండ నియోజకవర్గంలో అత్యధిక భాగం ఇన్న ఛార్జీ దుబ్బాక నర్సింహ్మారెడ్డి కనుసన్నుల్లోనే కొనసాగుతోంది. తిప్పర్తి,నల్గొండ పట్టణంలో కొన్ని చోట్ల చకిలం అనిల్ కుమార్, కనగల్ లో కొన్ని గ్రామాల్లో ఛాడా కిషన్ రెడ్డి ల ప్రభావం ఉంది.
జిల్లాలో తమకు సరైన ప్రాతనిధ్యం...గౌరవం లభించడం లేదని ఇద్దరు కీలక నేతలు అధిష్టానం వద్ద మోరపెట్టుకున్నట్లు సమాచారం. నియోజకవర్గాలు పెరుగుతాయి, ఇద్దరు నేతలు ఉన్న చోట ఇబ్బంది ఉండదని కేసిఆర్ హామీ ఇవ్వడంతో కొంత భరోసాతో ఉన్నారు. అయితే అధినేత ప్రకటనకు భిన్నంగా ఇప్పట్లో నియోజకవర్గాల పునర్విభజన ఉండదని ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి కుండబద్దలు కొట్టడంతో అసమ్మతి నేతల్లో గుబులు మొదలైంది. నామినేటెడ్ పదవులు పందేరం నేపధ్యంలో ఎనిమిది నెలల సహనానికి ఎప్పుడు ఊరడింపు లభిస్తుందోనన్న ఆశతో ఉన్నారు. మొత్తానికి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ తరహాలోనే ఆయా నియోజకవర్గాల్లో వర్గపోరు కొనసాగుతోంది.
మంత్రి జగదీశ్ రెడ్డి నియోజకవర్గమైన సూర్యాపేటలో పాతకొత్త నేతల మధ్య అసమ్మతి నివురుగప్పిన నిప్పులా ఉంది. కొత్త వారి చేరికతో తమకు రావాల్సిన పదవులు, ప్రాధాన్యంలో లోటు ఏర్పడతుతుందనేది పాత కాపుల వాదన. గండూరి ప్రకాశ్ వంటి నేతలు చివరి క్షణంలో వచ్చి ఆధిపత్యం చేస్తున్నారనే మనోవేదనలో పాత నేతలున్నారు. మంత్రి ఇలాఖాలోనే గులాబి తమ్ముల్లు తన్నుకున్నారు. టిఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మంత్రి పాల్గొని వెళ్లిన వెంటనే రెండు గ్రూపులు బాహాబాహికి దిగాయి. ఒకరినొకరు తోసుకుంటూ...నువ్వెంతా..అంటే నువ్వెంతా అంటూ ఘర్ఘణకు దిగారు. దేవరకొండ నియోజకవర్గంలో బాలునాయక్ చేరికతో సమీకరణాలు మారాయి. బాలు చేరికతో పాత కాపు రాములునాయక్ పూర్తిగా మౌనంగా ఉన్నారు. జడ్పీ ఛైర్మన్, నియోజకవర్గ ఇన్ ఛార్జీ అధికార పార్టీ కావడంతో బాలునాయక్ వైపు నియోజకవర్గ నేతలు మొగ్గుచూపుతున్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో ముచ్చటగా మూడు వర్గాలు కొనసాగుతున్నాయి. జిల్లాలోనే ఇక్కడ ఆధిపత్యపోరు అగ్రభాగాన ఉంది. పాత కాపు దొంతిరెడ్డి శ్రీనివార్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ ఛార్జీ శంకరమ్మ, సీనియర్ నేత సాముల శివారెడ్డి ఎవరికి వారే అన్నట్లు ఉన్నారు. ఈ నియోజకవర్గంలోని అత్యధిక మండలాల అధ్యక్షులు పాత కాపులు దొంతిరెడ్డి నాయకత్వంలోనే ఉన్నారు. కొత్తగా చేరిన వారు శంకరమ్మ వైపు అడుగులు వేస్తున్నారు. శివారెడ్డి వైపు బలమైన సామాజిక వర్గం ఉంది. ముగ్గురు ఇలా ఉంటే గ్రందాలయ ఛైర్మన్ అల్లం ప్రబాకర రెడ్డి మరో గ్రూపుగా ఉన్నారు. ఇటీవల హుజూర్ నగర్ లో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. అసమ్మతిని దారిన పెట్టే బాధ్యతను పార్లమెంటరీ కార్యదర్శి గాదారి కిషోర్ కు బాధ్యతలు అప్పగించారు. ఆతర్వాత నేరెడుచర్ల లో ఇరు గ్రాపులు పిడి గుద్దులు గుద్దుకున్నారు...గాల్లోకీ కుర్చీలు విసురుకున్నారు.


No comments:
Post a Comment