Follow Us:

RSS

Wellcome to Our Website

We are working on our website design. We are sure this new website will completely blow your mind! Subscribe by entering your e-mail below to stay updated on our progress.

Launching
comeback
launchpad

Wednesday, 11 May 2016

కరీంనగర్‌ కార్పొరేషన్‌లో స్టాండింగ్‌ కమిటీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ - 23న ఎన్నికలు

కరీంనగర్‌ కార్పొరేషన్‌లో స్టాండింగ్‌ కమిటీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ - 23న ఎన్నికలు
కరీంనగర్‌ :
బల్దియాలో ఎన్నికల సందడి మొదలైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్టాండింగ్‌ కమిటీ ఎన్నికలకు ఎట్టకేలకు నోటిఫికేషన్‌ వెలువడింది. దీంతో ఆశావహులు నేతలను ప్రసన్నం చేసుకోవడంలో నిమగ్నమయ్యారు. కరీంనగర్‌ నగరపాలక సంస్థలో స్టాండింగ్‌ కమిటీ ఎన్నికలకు బల్దియా అధికారులు
నోటిఫికేషన్‌ జారీ చేశారు. 16వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు.17 నా మినేషన్ల పరిశీలన, 18 నుంచి 20 వరకు అభ్యర్థుల ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. ఈ నెల 23న ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఎన్నికల నిర్వహణతో నగరపాలక సంస్థలో వి విధ అభివ ద్ధి పనులకు వేగం గా అనుమతులు వచ్చే అవకాశముంది. ఎన్నికల నోటిఫికేషన్‌ రావడంతో బల్దియాలో ఒక్కసారి ఎ న్నికల సందడి
మొదలైంది. బల్దియాలో అత్యధిక బలం టీఆర్‌ఎస్‌కు ఉండడం వారి నుంచే పోటీ ఎ క్కువగా కనిపిస్తున్నది. ముఖ్యంగా అధికార పార్టీ లో ఆశావహుల
సందడి మొదలైంది. ఈ పదవుల్లో తమకు అవకాశం కల్పించాలంటూ ఇప్ప టికే పలువురు టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు ఎమ్మెల్యే, మేయర్లకు విన్నవిస్తున్నారు.
జీఓ 54 ప్రకారం స్టాండింగ్‌ కమిటీ ఎన్నికలు ని ర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీని ప్ర కారం 50 డివిజన్లకు కలిపి ఐదుగురు సభ్యులను
ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈమేరకు పోటీలో ఉన్న అభ్యర్థులకు కార్పొరేటర్లు ఒక్కొక్కరు ఐదు ఓట్లు వేయాల్సి ఉంటుంది. అత్యధిక ఓట్లు వచ్చిన వారిని
స్టాండింగ్‌ కమిటీ సభ్యులుగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటిస్తారు.నగరపాలక సంస్థలో రెండేళ్లుగా ఎదురుచూస్తున్న స్టాండింగ్‌ కమిటీ ఎన్నికలకు ప్రభుత్వం
తెర తీ యడంతో టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లలో పోటీ మొదలైంది. బల్దియాల్లో పాలకవర్గం కొలువుదీరిన తొ లినాళ్లలోనే ఈ కమిటీల పదవులపై కార్పొరేటర్లు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఆరంభంలో పలువురు ఈ కమిటీ పదవుల కోసం ఎమ్మెల్యేలు, మేయర్ల చుట్టు ప్రదక్షిణలు కూడా చేశారు. అయి తే రాష్ట్ర విభజన
నేపథ్యంలో స్టాండింగ్‌ కమిటీల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ కాక ఇప్పటివరకు నగరపాలక సంస్థ ల్లో ఈ కమిటీల ఎన్నికలు
జరగలేదు.
కాగా ప్రస్తు తం నోటిఫికేషన్‌ జారీకావడంతో కార్పొరేటర్లు ఈ పదవుల కోసం జోరుగా ప్రయత్నాలు చేస్తున్నా రు. మొత్తం 50 డివిజన్లుండగా బీజేపీ,
ఎంఐఎంలకు ఇద్దరు సభ్యుల చొప్పున, కాంగ్రెస్‌కు తొమ్మిది మంది సభ్యుల బలం ఉంది. టీఆర్‌ఎస్‌ అత్యధికంగా 37మంది ఉన్నారు. దీంతో ఈ కమిటీల్లో
పూర్తిస్థాయిలో టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లకే అవకాశం దక్కనుండడంతో పోటీ తీవ్రం కానుంది. ఈ విషయంలో ఇప్పటికే పలువురు కార్పొరేటర్లు ఎమ్మెల్యేకు
తమకు తప్పనిసరిగా ఈ కమిటీలో అవకాశం కల్పించాలని విన్నవిస్తున్నట్లు సమాచారం.
అలాగే మేయర్‌ ఎన్నికల సమయంలో ప లువురు కాంగ్రెస్‌, స్వతంత్రులు టీఆర్‌ఎస్‌లో చేరారు. వారు ఇప్పుడు ఈ కమిటీలో తమకు అ వకాశం
ఇవ్వాలంటూ ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఎమ్మెల్యే రెండు రోజుల్లో విదేశాలకు వేళ్లే అవకాశం ఉందని సమాచారం. దీంతో ఈ ఎ న్నికల్లో పోటీ చేసే
అభ్యర్థుల ఎంపిక విషయంలో ఎలాంటి నిర?యాలు తీసుకుంటారన్న విషయం లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ పార్టీలో పలువురు కార్పొరేటర్ల మధ్య
విభేదాలున్న సమయంలో ఈ ఎన్నికలు నిర్వహిస్తుండడగా ఎమ్మె ల్యే, మేయర్ల్లు.. అభ్యర్థులుగా ఎవరిని ఎంపిక చే శారన్న విషయంలో ఆసక్తిగా మారింది.

No comments:

Post a Comment

Powered by Blogger.

About The Soonex

>> <<

Get in Touch

Your e-mail address is incorrect. Please check it and try again.

Thanks for your subscription!

ప్రకటన

ప్రకటన

Select a Date

క్యాలెండర్ ఆవిష్కరణ

Ad Space

ప్రకటన

ప్రకటన

Ad Space

E-Paper

Select a Date to View Old Edition

Popular Post

ప్రకటన

Ad Space

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks